Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేతన్ అగర్వాల్ హత్య కేసు: 'పురుషుల జాతీయ కమిషన్' ఏర్పాటుకు ఎంపీ డిమాండ్

కేతన్ అగర్వాల్ హత్య కేసు: 'పురుషుల జాతీయ కమిషన్' ఏర్పాటుకు ఎంపీ డిమాండ్

వార్త 3 weeks ago

Ketan Agarwal: మహారాష్ట్రలోని పుణేకు చెందిన 26 ఏళ్ల కేతన్‌ అగర్వాల్‌ను అతడి కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘోర క్రూరత్వం నేపథ్యంలో పురుషుల రక్షణ, హక్కుల కోసం దేశంలో ‘పురుషుల జాతీయ కమిషన్’ (National Commission for Men) ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, ఇటీవల బీజేపీలో చేరిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) వ్యవస్థాపకుడు, ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ శనివారం ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.

Read Also: Gade Saikrishna case: నా కొడుకును పోలీసులే చంపేశారు.. మెజిస్టీరియల్ విచారణలో సాయికృష్ణ తల్లి

 Ketan Agarwal

Ketan Agarwal: కేతన్ ఉదంతం ఒక హెచ్చరిక: ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

కేతన్ అగర్వాల్ కేసు తీవ్రంగా కలవరపరిచే అంశమని, ఈ సంఘటన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక అని ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా (X) స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు:”లింగ భేదం లేకుండా న్యాయం అందరికీ సమానంగా జరగాలి. కేతన్ మరియు అతడి కుటుంబానికి నిష్పాక్షికమైన, సమగ్రమైన విచారణ ద్వారా న్యాయం జరగాలి. ప్రతి బాధితుడికి చట్టం ముందు సమాన రక్షణ లభించాలి.” అని పేర్కొన్నారు. మహిళల తరహాలోనే పురుషులు కూడా నేరాలు, కుట్రలకు బాధితులు కాగలరని కేతన్ కేసు రుజువు చేసిందని, కాబట్టి మగవారి బాధలను ఆలకించడానికి, వారికి సంస్థాగత మద్దతు, చట్టపరమైన రక్షణ కల్పించడానికి ఒక ప్రత్యేక అధికారిక వేదిక అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.

చర్చనీయాంశంగా మారిన పార్లమెంట్ ‘ప్రైవేట్ బిల్లు’

జాతీయ మహిళా కమిషన్ తరహాలోనే పురుషుల కోసం కూడా ఒక జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ గత ఏడాది డిసెంబర్‌లో తాను రాజ్యసభలో ప్రవేశపెట్టిన ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’కు సంబంధించిన వీడియోను ఎంపీ ఈ సందర్భంగా షేర్ చేశారు. కేతన్ హత్య నేపథ్యంలో ఈ ప్రతిపాదిత బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది.

ప్రైవేట్ బిల్లుల చరిత్ర: సాధారణంగా మంత్రి వర్గంలో లేని ఎంపీలు (అధికార లేదా ప్రతిపక్ష) ప్రవేశపెట్టే బిల్లులను ‘ప్రైవేట్ బిల్లులు’ అంటారు. పార్లమెంట్‌లో ఇలాంటి బిల్లులు చట్టంగా మారడం అత్యంత అరుదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కేవలం 14 ప్రైవేట్ బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. మరీ ముఖ్యంగా, 1970 తర్వాత పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఏ ఒక్క ప్రైవేట్‌ బిల్లు కూడా ఆమోదం పొందకపోవడం గమనార్హం. అయినప్పటికీ, పురుషుల హక్కులపై అవగాహన పెంచడానికి ఈ బిల్లు ఒక కీలక వేదికగా నిలిచింది.

Epaper: epaper.vaartha.com

ట్రిపుల్‌ ఐటీలో విషాదం.. ఆరో అంతస్తు పైనుంచి దూకేసిన స్టూడెంట్.. అసలేం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha