Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కిర్లంపూడిలో ఉద్రిక్తత.. తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన క్రాంతి ని అడ్డుకున్న తల్లి

కిర్లంపూడిలో ఉద్రిక్తత.. తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన క్రాంతి ని అడ్డుకున్న తల్లి

వార్త 3 weeks ago

Mudragada Died : ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు మరియు తన తండ్రిని చివరిసారి చూసేందుకు ఆయన కుమార్తె, జనసేన నాయకురాలు క్రాంతి కిర్లంపూడిలోని నివాసానికి చేరుకున్నారు.

అయితే, ఆమె రాకను ముద్రగడ అనుచరులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. క్రాంతి లోపలికి ప్రవేశించకుండా ముద్రగడ భార్య (తల్లి) గట్టిగా అరిచి, ఆమెను వెంటనే అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ ముద్రగడ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కిర్లంపూడి నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన తండ్రి భౌతికకాయాన్ని చూసేందుకు అనుమతించాలని క్రాంతి కన్నీరుమున్నీరవుతూ ఎంత వేడుకున్నప్పటికీ, కుటుంబ సభ్యులు ఆమెను కనీసం పార్థివ దేహం ఉంచిన పెట్టెను కూడా తాకనివ్వలేదు.

రాజకీయ విభేదాలే కారణమా?

తండ్రీకూతుళ్ల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ, వ్యక్తిగత విభేదాలే ఈ తాజా వివాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) లో చేరగా, ఆయన కుమార్తె క్రాంతి దానికి భిన్నంగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా క్రాంతి చేసిన ప్రచారం, తండ్రిపై చేసిన విమర్శలు ఇరుపక్షాల మధ్య దూరాన్ని పెంచాయి. గతంలో ముద్రగడ పద్మనాభం స్వయంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తన కుమార్తె రాజకీయ ప్రయోజనాల కోసం తనపై ఆరోపణలు చేస్తోందని, ఆమెను తాను కూతురిగా గుర్తించడం లేదని సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ అంతిమ సంస్కారాల వద్ద క్రాంతిని రానివ్వకుండా తల్లి మరియు సోదరుడు అడ్డుకున్నారు. చివరకు పోలీసుల జోక్యంతో తీవ్ర ఆవేదన నడుమ దూరంగా నిలబడి తండ్రిని కడసారి చూసుకున్న క్రాంతి, కన్నీళ్లతో అక్కడి నుండి వెనుదిరిగారు.

ఈ నెల 17న మంగళగిరి రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha