Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోహిర్ ఎక్స్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం

కోహిర్ ఎక్స్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం

వార్త 2 weeks ago

Kohir X Road Accident: సంగారెడ్డి జిల్లా కోహిర్ చౌరస్తా (X Road) సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా కార్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో సదాశివపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

పల్టీ కొట్టిన కారు.. వెనుక నుంచి ఢీకొన్న వాహనాలు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న ఒక కారు హఠాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పల్టీలు కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వస్తున్న మరో మూడు కార్లు ఒకదానినొకటి బలంగా ఢీకొట్టాయి. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Kohir X Road Accident: మృతులు సదాశివపేట వాసులుగా గుర్తింపు

సమాచారం అందుకున్న వెంటనే కోహిర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని సదాశివపేట పట్టణంలోని 1వ వార్డుకు చెందిన బోడగమా మల్లికార్జున్ (52), శంకర్ (52)లుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో మల్లికార్జున్ ఎంఆర్‌ఎఫ్ (MRF) కంపెనీ ఉద్యోగి కాగా, శంకర్ సదాశివపేట మున్సిపల్ ఉద్యోగి అని అధికారులు తెలిపారు.

మృతదేహాలను, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు కోహిర్ పోలీసులు వెల్లడించారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు రాత్రి వేళ ప్రమాదంలో మృతి చెందడంతో సదాశివపేటలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది

ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha