Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కురవి ప్రధాన రహదారిపై ప్రమాదం.. లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు, విద్యార్థులకు గాయాలు!

కురవి ప్రధాన రహదారిపై ప్రమాదం.. లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు, విద్యార్థులకు గాయాలు!

వార్త 2 weeks ago

Accident in Kuravi : మహబూబాబాద్ జిల్లా కురవి-ఖమ్మం ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం భయంకరమైన రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కురవి సమీపంలోని నల్లెల్ల స్టేజి మూల మలుపు వద్ద నాగార్జున విద్యాలయానికి చెందిన స్కూల్ బస్సు అతివేగంగా దూసుకొచ్చి, ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పాఠశాలకు వెళ్తున్న పలువురు విద్యార్థులు ఉండగా, ఈ ఘోర సంఘటనలో చాలా మంది చిన్నారులు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానిక ప్రజలు, బాటసారులు అత్యంత మానవత్వంతో సహాయక చర్యలు చేపట్టి, బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, తమ పిల్లల పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు, భయాందోళనలకు గురయ్యారు.

సమయం సరిపోక డ్రైవర్ల వేగం.. యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల తీవ్ర ఆగ్రహం!

ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కేవలం ఒకే ఒక్క స్కూల్ బస్సును మూడు నుండి నాలుగు వేర్వేరు సుదూర రూట్లలో తిప్పుతూ, విద్యార్థులను తీసుకురావడానికి యాజమాన్యం వినియోగిస్తోందని వారు ఆరోపించారు. నిర్ణీత సమయానికి అన్ని రూట్లను పూర్తి చేసి స్కూలుకు చేరుకోవాలనే విపరీతమైన ఒత్తిడి కారణంగానే డ్రైవర్ బస్సును జనావాసాల మధ్య కూడా అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతున్నాడని వాపోయారు. ప్రస్తుతం పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమాని మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha