Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుర్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

కుర్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

వార్త 1 week ago

Kurla Landslide: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వానల కారణంగా బుధవారం తెల్లవారుజామున కుర్లా (Kurla) ప్రాంతంలోని నివాస స్థలాలపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో 6 నుంచి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Kurla Landslide: ప్రమాద వివరాలు & ప్రాణనష్టం

బుధవారం ఉదయం సుమారు 3:48 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రజలందరూ గాఢ నిద్రలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మృతులను సాహిల్ అన్సారీ (28), మొహమ్మద్ సమీర్ (14) గా అధికారులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సోహెల్ అన్సారీ (18), మొహమ్మద్ అన్సారీ (14)లను సమీపంలోని కుర్లా భాభా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక దళాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. మహారాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha