East Godavari: కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
చిన్నపాటి మనస్పర్థలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఉంటేనే ప్రత్యర్థులకు అవకాశం ఉండదని ఆయన వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
Read also: MLAs Support to Vijay:టీవీకేకు మద్దతుగా 40 మంది ఎమ్మెల్యేలు?
CM meeting with alliance leaders
East Godavari: నేతల వ్యక్తిగత ప్రవర్తన ముఖ్యం
ప్రభుత్వ పనితీరుతో పాటు నాయకుల వ్యక్తిగత ప్రవర్తనను కూడా ప్రజలు నిశితంగా గమనిస్తారని చంద్రబాబు ప్రజాప్రతినిధులకు సూచించారు. సొంత ఇష్టాయిష్టాల కంటే ప్రజల ఆలోచనలకు, అవసరాలకు పెద్దపీట వేయాలని ఆయన కోరారు. తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా రైతుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజల మార్పును కోరుకుంటున్న తీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధం – సఖ్యతతో ముందుకు సాగాలి
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తాను, పవన్ కల్యాణ్ ఏ విధంగా సఖ్యతతో ఉంటున్నామో, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా అదే స్నేహభావంతో ఉండాలని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను ప్రభుత్వం గుర్తించి తగిన గుర్తింపు ఇస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక భవనాలు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, కులాల మధ్య దూరం పెంచేలా ఉండకూడదని సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

