Iran Attack : మధ్యప్రాచ్యంలో (Middle East) ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. అమెరికా లక్ష్యంగా ఇరాన్ భారీ ప్రతీకార దాడులకు దిగింది.
కువైట్, బహ్రెయిన్ దేశాలలో విస్తరించి ఉన్న దాదాపు 18 అమెరికా సైనిక స్థావరాలను (US Military Bases) టార్గెట్ చేస్తూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విరుచుకుపడింది. తాము క్షిపణులు, డ్రోన్లతో దీటుగా బదులివ్వడం వల్లే అమెరికా తన దాడులను ప్రస్తుతానికి నిలిపివేసిందని IRGC అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన పవిత్ర ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) ప్రాంతంలో అమెరికా లేదా దాని మిత్రపక్షాలు ఎలాంటి హానికరమైన చర్యలకు దిగినా నరకం చూపిస్తామని IRGC కమాండర్ మాజిద్ మౌసావి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
Read Also : నిద్రపోతున్న పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు..12 మంది మృతి!

హై అలర్ట్లో గల్ఫ్ దేశాలు.. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ చేసిన కువైట్!
ఇరాన్ అకస్మాత్తుగా జరిపిన ఈ దాడులతో గల్ఫ్ రీజియన్లో తీవ్ర కలకలం రేగింది. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై తమ దేశ ఎయిర్ స్పేస్ (వైమానిక శ్రేణి) ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. శత్రువుల క్షిపణులను గాల్లోనే కూల్చివేసేందుకు వీలుగా తమ అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (Air Defense Systems) ను యాక్టివేట్ చేసినట్లు కువైట్ రక్షణ శాఖ వెల్లడించింది. ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంత దేశాలన్నీ ప్రస్తుతం హై అలర్ట్లోకి వెళ్లాయి. ఈ దాడులు గల్ఫ్ దేశాల సార్వభౌమత్వానికి, అంతర్జాతీయ చమురు మార్కెట్కు పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

