America Attack Cuba : కరేబియన్ దీవుల దేశమైన క్యూబా సమీపంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
గత కొన్ని నెలలుగా వ్యూహాత్మకంగా సాగుతున్న ఈ సైనిక కదలికలు త్వరలోనే క్యూబాపై వైమానిక లేదా ల్యాండ్ దాడులకు దారితీయవచ్చని అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అట్లాంటిక్, కరేబియన్ సముద్ర జలాల్లోకి అమెరికాకు చెందిన శతాధిక యుద్ధనౌకలు, 'యూఎస్ఎస్ నిమిత్జ్' (USS Nimitz) వంటి భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, క్షిపణి విధ్వంసక నౌకలు (Missile Destroyers), మరియు అత్యాధునిక నిఘా డ్రోన్లు రంగంలోకి దిగాయి. వీటికి తోడు దాదాపు 2,500 మందికి పైగా అమెరికా ప్రత్యేక సైనికులు (US Marines) క్యూబా పరిసర ప్రాంతాల్లో మొహరించారు. గతంలో వెనిజులాలో జరిగిన సైనిక చర్యల తరహాలోనే, ఈ మోహరింపు కూడా క్యూబాలో దాడులకు ముందస్తు వ్యూహమనే అనుమానాలు బలపడుతున్నాయి.
Read Also : దాడుల తర్వాత ఇజ్రాయెల్ను తీవ్రంగా హెచ్చరించిన ఇరాన్

కమ్యూనిస్టు పాలనే లక్ష్యం
అమెరికా ఈ స్థాయిలో మోహరింపులు చేపట్టడం వెనుక క్యూబాలోని సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనను అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా విధించిన చమురు దిగ్బంధం (Fuel Blockade) కారణంగా ఇప్పటికే క్యూబా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ విభాగం నేరుగా క్యూబా ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులు జరపవచ్చని లేదా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా అక్కడి వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నించవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, తాము కేవలం ప్రాంతీయ భద్రత, రక్షణ భాగస్వామ్యంలో భాగంగానే ఈ విన్యాసాలు చేస్తున్నట్లు అమెరికా సైనిక కమాండ్ (SOUTHCOM) పైకి చెబుతున్నప్పటికీ, సరిహద్దుల్లో పెరుగుతున్న యుద్ధ వాతావరణం కరేబియన్ తీరంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
వలసదారులపై బీజేపీ ఉక్కు చర్యలు..హకీంపూర్ సరిహద్దులో పెరిగిన రాకపోకలు

