Lakshmi Narayana Swamy Brahmotsavam: తలకొండపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన కళ్యాణమహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది.
ఈ వేడుకల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Read Also:TRS : మీ టైమ్ ముగిసిందంటూ బిఆర్ఎస్ కు కవిత కౌంటర్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ కమిటీ సభ్యులు తనను ఆహ్వానించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుప్పమ్మ అంజన్ రెడ్డి, ఆలయ చైర్మన్ జగన్, ఉపాధ్యక్షుడు నిరంజన్, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యుడు మల్లేశ్, యువనాయకుడు శివరాజ్తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

