Lingamaneni Ramesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ పేరును ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలు మరియు జనసైనికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్టనష్టాలు ఓర్చి, లాఠీ దెబ్బలు తింటూ నడిచిన ఎంతో మంది సీనియర్ నేతలను కాదని, పార్టీ కార్యక్రమాల్లో ఎన్నడూ యాక్టివ్గా కనిపించని ఒక కార్పొరేట్ వ్యాపారికి అత్యున్నతమైన రాజ్యసభ స్థానాన్ని ఎలా కేటాయిస్తారంటూ సోషల్ మీడియా వేదికగా జనసైనికులు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఈ ఎంపిక పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందంటూ నెట్టింట పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తున్నాయి.
Read Also : తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

పవన్ కళ్యాణ్తో దశాబ్ద కాలపు అనుబంధం: జనసేన పార్టీ అధికారిక వివరణ
జనసైనికుల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర నిరసనలపై జనసేన పార్టీ అధిష్టానం తక్షణమే స్పందించింది. లింగమనేని రమేశ్ ఎంపికను సమర్థిస్తూ పార్టీ అధికారికంగా ఒక ట్వీట్ (ప్రకటన) విడుదల చేసింది. లింగమనేని రమేశ్కు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు 2015 సంవత్సరం నుంచే అత్యంత ఆత్మీయమైన, బలమైన అనుబంధం ఉందని పార్టీ గుర్తు చేసింది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జనసేన తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకుని, పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైన కష్టకాలంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ వెంటే నిలిచారని పేర్కొంది. జనసేన సిద్ధాంతాలపై పూర్తి విశ్వాసం ఉంచి, పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారికే ప్రాధాన్యత క్రమంలో నామినేటెడ్ పదవులు, ఇలాంటి సముచిత స్థానాలు దక్కుతాయని జనసేన స్పష్టం చేస్తూ అసంతృప్త నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

