Dailyhunt
మద్యం సేవించి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్.. ఆందోళనలో ప్రయాణికులు

మద్యం సేవించి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్.. ఆందోళనలో ప్రయాణికులు

వార్త 5 days ago

Medak District: మెదక్ జిల్లా నర్సాపూర్ కు మేడ్చల్ నుండి మద్యం సేవించి ఆర్టిసి బస్సు నడుపుతున్నాడని ప్రయాణికులు భయాందోళనతో ఆందోళన వ్యక్తం చేశారు.

నరసాపూర్ బస్టాండ్ కి రాగానే ప్రయాణికులు బస్సులు నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్ డిపోకు చెందిన తిరుమలేశాన్ని ఆర్టీసీ డ్రైవర్ మద్యం సేవించి బస్సును నర్సాపూర్ కి నడుపుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

Read Also : Gadwal fire accident: గద్వాల నయీ మసీదులో అగ్నిప్రమాదం..

 RTC driver caught drunk and driving

Medak District: పోలీసుల తనిఖీ

సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ను అదుపులో తీసుకొని బ్రీతింగ్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు రుజువైందని పోలీసులు గుర్తించారు. బస్సులో దాదాపుగా 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించాలి ప్రయాణికుల పట్ల మద్యం సేవించిన డ్రైవర్ చిరాకు పడుతూ చిందులేయడంతో ప్రయాణికులు మద్యం సేవించినట్లుగా గుర్తించారు. వెంటనే స్పందించిన నర్సాపూర్ ఆర్టీసీ అధికారులు నరసాపూర్ బస్టాండ్ లోని బస్సును నిలిపివేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha