Srisailam Silver Nagabharanam: అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం (ఏప్రిల్ 19) శ్రీశైల మల్లన్నకు హైదరాబాద్కు చెందిన భక్తులు అపురూపమైన కానుకను సమర్పించారు.
Read Also:Hayathnagar BTech Student Suicide: హాల్ టికెట్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య!
5 శిరస్సుల నాగాభరణం సమర్పణ
హైదరాబాద్ వాస్తవ్యులు ఎం. నవ్యరవీంద్రారెడ్డి తన భక్తిని చాటుకుంటూ, అయిదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఈ నాగాభరణం మొత్తం బరువు 2 కేజీల 400 గ్రాములు ఉన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి అలంకరణలో భాగంగా ఈ విశిష్ట ఆభరణాన్ని ఉపయోగించనున్నారు.

Srisailam Silver Nagabharanam: వేద ఆశీర్వచనాలతో సత్కారం
ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో జరిగిన కార్యక్రమంలో దాతలు ఈ వెండి నాగాభరణాన్ని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయస్వామి, ఉప ప్రధానార్చకులు ఎం. శివశంకరయ్య, పర్యవేక్షకులు గంజి రవి మరియు ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునలకు అందజేశారు. విరాళం స్వీకరించిన అనంతరం, ఆలయ అధికారులు దాతలకు అధికారిక రశీదును అందజేశారు. వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేసి, శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు మరియు ప్రసాదాలను అందజేసి గౌరవించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
సిద్దిపేట బిడ్డ టీమ్ ఇండియాలో ఆడాలి.. అదే నా కల: హరీష్ రావు ఆకాంక్ష

