Dailyhunt
మల్లిఖార్జున్ ఖర్గేతో ఎంపీ శశిధరూర్ భేటీ

మల్లిఖార్జున్ ఖర్గేతో ఎంపీ శశిధరూర్ భేటీ

వార్త 10 hrs ago

Kerala Election Results: కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన మల్లిఖార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్జితో గెలుపొందిన విషయం తెలిసిందే.

నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్
చర్చలు జరుపుతున్నది. కాగా తిరువనంతపురంలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం
జరిగింది. దీంతో శశిథరూర్ ఖర్గేతో భేటీ అయి, కేరళలోని ప్రస్తుత పరిస్థితులను వివరించారు.
ఎవరిని సీఎంగా ఎంపిక చేయాలో, కేరళలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సల
హాలను, సూచనలు ఈసందర్భంగా ఖర్గేతో శశిథరూర్ పంచుకున్నారు. ఖర్గేతో సమావేశమైన
ఫొటోను శశిథరూర్ ఎక్స్ లో పంచుకున్నారు.

Read Also:Mamata Banerjee: మమతా బెనర్జీ సర్కార్ ను గవర్నర

Kerala Election Results: సీఎల్ పీ సమావేశంలో సీఎం నిర్ణయం

గెలుపొందిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ఇప్పటికే పలుదఫాలుగా చర్చలు జరిపింది. మెజార్టీ ఎ
మ్మెల్యే అభిప్రాయాల అనుగుణంగానే సీఎం ఎంపిక ఉంటుందని కేరళ రాష్ట్ర కాంగ్రెస్
అధ్యక్షుడు తెలిపారు. గెలుపొందిన ఎమ్మెల్యేల లిస్టు, వారి అభిప్రాయాలతో కూడిన రిపోర్టును
కాంగ్రెస్ హైకమాండ్ కు కేరళ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే సమర్పించారు. ఢిల్లీలో త్వరలో సీఎల్
పీ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో చర్చించి, తదుపరి సీఎం ఎవరో
నిర్ణయించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha