బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి ప్రధాన కారణం పార్టీలో పెరిగిపోయిన అవినీతి మరియు వ్యవస్థాగత వైఫల్యాలని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా టీచర్ల నియామక కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా విద్యావంతులైన యువతలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
అర్హత ఉన్న అభ్యర్థులను కాదని, అక్రమాలకు పాల్పడటం టీఎంసీ ప్రతిష్టను గూగుల్ మట్టం చేసింది. దీనికి తోడు, సుదీర్ఘకాలం అధికారంలో ఉండటంతో క్షేత్రస్థాయి నేతల్లో గర్వం పెరిగిందని, వారు సామాన్య ప్రజలకు దూరం కావడంతో ‘యాంటీ ఇంకంబెన్సీ’ (ప్రభుత్వ వ్యతిరేకత) బలంగా పనిచేసిందని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
Read Also : విజయ్ పార్టీకి ఆ పార్టీలు మద్దతు ఇస్తాయా ?
Mamata Banerjeeశాంతిభద్రతలు – మహిళా ఓటర్ల అసహనం
ఒకప్పుడు మమతకు వెన్నెముకలా నిలిచిన మహిళా ఓటర్లు ఈసారి ఆమెకు దూరమవ్వడం టీఎంసీ కొంపముంచింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఆర్.జి.కర్ ఆసుపత్రి ఘటన వంటి విచారకరమైన సంఘటనలు బెంగాల్ సమాజాన్ని కుదిపేయడమే కాకుండా, మమతా బెనర్జీ ‘మహిళా పక్షపాతి’ అనే ఇమేజ్ను దెబ్బతీశాయి. భద్రత మరియు అభివృద్ధి విషయంలో బీజేపీ ఇచ్చిన హామీల వైపు మహిళా ఓటర్లు మొగ్గు చూపడం మమత ఓటమికి కీలకమైంది.
హిందూ ఓటర్ల ఏకీకరణ
బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారుల పట్ల మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరిపై హిందూ ఓటర్లు ఈసారి ఏకమయ్యారు. వలసదారులకు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అండగా ఉంటున్నారన్న ఆందోళనతో, రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లు బీజేపీ వైపు నిలిచారు. మరోవైపు, ముస్లిం ఓట్లు ఐఎస్ఎఫ్ (ISF) మరియు ఇతర పార్టీల మధ్య చీలిపోవడం కూడా టీఎంసీకి పెద్ద దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా మమతకు రక్షణ కవచంలా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకులో చీలిక రావడం మరియు హిందూ ఓటర్ల ధ్రువీకరణ జరగడం బెంగాల్లో పద్మం వికసించడానికి మార్గం సుగమం చేశాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

