పశ్చిమ బెంగాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు వెన్నెముకగా నిలిచిన ముస్లిం ఓటర్లు, ఈసారి మాత్రం గంపగుత్తగా మమతా బెనర్జీ వైపు నిలబడలేదు.
ఎప్పుడూ టీఎంసీకి ఏకపక్షంగా ఓటు వేసే ముస్లిం సామాజిక వర్గంలో ఈసారి స్పష్టమైన చీలిక కనిపించింది. వక్స్ చట్ట సవరణలు, ఎన్ఆర్సి (NRC), ఓబీసీ జాబితా నుంచి కొన్ని ముస్లిం వర్గాల తొలగింపు వంటి అంశాలపై మమతా బెనర్జీ కేంద్రంపై ఎంతగా పోరాడినప్పటికీ, క్షేత్రస్థాయిలో ముస్లిం ఓటర్ల పూర్తి విశ్వాసాన్ని ఆమె పొందలేకపోయారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడం, కేవలం ఓటు బ్యాంక్గానే పరిగణించబడుతున్నామనే అసంతృప్తి ఓటర్లలో బలంగా కనిపించింది.
Read Also : మోదీ అభినందనలపై విజయ్ రియాక్షన్ ఇదే!

ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు.. చీలిపోయిన ఓట్లు
ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కేవలం టీఎంసీకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పార్టీల వైపు దృష్టి సారించారు. ముఖ్యంగా అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం (MIM) తో పాటు ఇతర స్వతంత్ర ముస్లిం అభ్యర్థులు బరిలో ఉండటంతో ఓట్లు భారీగా చీలిపోయాయి. ముస్లిం అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేసిన ప్రాంతాల్లో ఓటర్లు స్థానిక అంశాలకు, సొంత సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఓట్ల చీలిక నేరుగా టీఎంసీ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. మైనారిటీ ఓట్లు సంఘటితంగా పడకపోవడంతో మమతా బెనర్జీ కంచుకోటలు బద్దలయ్యాయి.
ముర్షిదాబాద్లో బీజేపీ అనూహ్య విజయం
ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సాధారణంగా ఇక్కడ టీఎంసీ ఏకపక్ష విజయం సాధిస్తుందని అందరూ భావించినా, ముస్లిం ఓట్ల చీలిక భారతీయ జనతా పార్టీకి (BJP) వరంగా మారింది. ఒకవైపు ముస్లిం ఓట్లు వివిధ పార్టీల మధ్య విభజన చెందగా, మరోవైపు హిందూ ఓట్లు బీజేపీ వైపు కేంద్రీకృతమవ్వడం ఆ పార్టీకి కలిసొచ్చింది. దీనివల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ పట్టు కోల్పోవడానికి ప్రధాన కారణమైంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
సీఎం పదవికి రాజీనామా చేయను ఇది "ప్రజాస్వామ్య హత్య".. మమతా బెనర్జీ

