Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మన్యం జిల్లాలో ఘోర ప్రమాదం..నలుగురు మృతి!

మన్యం జిల్లాలో ఘోర ప్రమాదం..నలుగురు మృతి!

వార్త 3 weeks ago

Jamparakota Accident: పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంపరకోట సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో నలుగురు మృతి చెందారు.

ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Read Also: Miryalaguda Bypass Road Accident: మిర్యాలగూడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం

లోయలో పడ్డ ఆటో.. నలుగురు గిరిజనుల మృతి

జంపరకోట సమీపంలోని ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు సీతంపేట మండలానికి చెందిన గిరిజనులుగా గుర్తించారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

Horrific Accident in Manyam District: Auto Falls into Gorge; Four Dead!

Jamparakota Accident: సహాయక చర్యలు.. ఆసుపత్రికి క్షతగాత్రులు

ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి క్షతగాత్రులను వెలికితీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో సీతంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతివేగం లేదా సాంకేతిక లోపం కారణంగానే ఆటో అదుపు తప్పి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆటోను ఢీకొన్న బైకు ఒకరికి తీవ్ర గాయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha