Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరికొన్ని నెలల్లో పెళ్లి.. అగ్నికీలల్లో చిక్కుకుని ప్రేమజంట మృతి

మరికొన్ని నెలల్లో పెళ్లి.. అగ్నికీలల్లో చిక్కుకుని ప్రేమజంట మృతి

వార్త 1 week ago

Lucknow Fire Tragedy: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని అలీగంజ్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం 15 కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవ్వాలనుకున్న ఒక ప్రేమజంట కూడా ఉండటం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

లఖ్‌నవూకు చెందిన నీలేశ్ కుమార్ (25), పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనామిక సామంత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరువైపులా పెద్దలు అంగీకారం తెలపడంతో, వచ్చే ఏడాది మార్చిలో వివాహం జరిపించాలని నిశ్చయించారు. అక్టోబరు నుంచే పెళ్లి పనులు ప్రారంభించాల్సి ఉంది. నీలేశ్, అనామిక ఇద్దరూ ప్రమాదం జరిగిన అలీగంజ్ భవనంలోని ఒక యానిమేషన్ స్టూడియోలోనే పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఎప్పట్లాగే విధులకు హాజరైన వీరిద్దరినీ అగ్నికీలలు చుట్టుముట్టాయి. తన కలలు సాకారం అయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పే బాధ్యతాయుతమైన నీలేశ్, ఇలా అర్ధంతరంగా దూరమవడంతో అతని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న అతని తల్లి తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. భవనంలో సరైన భద్రతా ప్రమాణాలు ఉండి, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే 15 మంది ప్రాణాలు దక్కేవని స్థానికులు వాపోతున్నారు.

Read Also: Delhi : చిన్నారిపై హత్యాచారం.. కాలుపై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు

 Lucknow Fire Tragedy

Lucknow Fire Tragedy: నలుగురు నిందితులకు జుడీషియల్ కస్టడీ.. సీరియస్ అయిన కోర్టు

ఈ ఘోర ప్రమాదానికి బాధ్యులుగా తేలిన నలుగురు నిందితులకు లఖ్‌నవూ కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో భవన యజమాని, గేమింగ్ జోన్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్/ఆపరేటర్, ఐటీ నెట్‍వర్కింగ్ ప్రొఫెషనల్, సంస్థ నిర్వాహకుడు ఉన్నారు. ఈ ప్రమాద తీవ్రతపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లోతుగా దర్యాప్తు చేస్తోంది. లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, భద్రతా నిబంధనల ఉల్లంఘన వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే కనీసం రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాబోయే భర్తను చంపేసి.. ఇన్‌స్టాలో కన్నీళ్ల నాటకం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha