Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరో నిందితుడు ధనంజయ్ అరెస్ట్!

మరో నిందితుడు ధనంజయ్ అరెస్ట్!

వార్త 1 week ago

NEET Paper Leak Case Update: నీట్-యూజీ (NEET-UG 2026) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.

ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న ధనంజయ్ అనే నిందితుడిని అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడిని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సీబీఐ, లీకేజీ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను కనిపెట్టేందుకు అతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరనుంది.

Read Also:NEET UG 2026: వచ్చే ఏడాది నుండి నీట్ యూజీ ఆన్‌లైన్ పరీక్షలు.. పేపర్ లీక్ దర్యాప్తులో సంచలన విషయాలు!

NEET Paper Leak Case Update: రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సీబీఐ

ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టు అనుమతితో సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ప్రశ్నపత్రం ఎక్కడ లీక్ అయింది? ఎంతమంది విద్యార్థులకు చేరింది? మరియు ఈ కుట్ర వెనుక ఉన్న ఇతర ప్రధాన వ్యక్తులు ఎవరు? అనే కీలక అంశాలపై అధికారులు వారిని లోతుగా విచారిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ఆధారాలతో నిందితుల వాంగ్మూలాలను సరిపోల్చుతూ సీబీఐ ముందుకు సాగుతోంది.

కస్టడీలోకి తీసుకుని విచారణ

మే 3న జరిగిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం విచారణను సీబీఐకి అప్పగించింది. విద్యార్థులకు న్యాయం చేసే దిశగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే జూన్ 21న రీ-ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దర్యాప్తులో తేలే అంశాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తెలంగాణ దోస్త్ తొలి విడత ఫలితాలు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha