Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరోసారి తన నీచబుద్ధిని బయటపెట్టిన పాకిస్థాన్

మరోసారి తన నీచబుద్ధిని బయటపెట్టిన పాకిస్థాన్

వార్త 2 weeks ago

Pakistan : కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా పాకిస్థాన్ తన వైఖరిని మరోసారి నెటిజన్ల ముందుకు తెచ్చింది.

సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల అగ్రనేతలందరూ కలిసి దిగిన సంప్రదాయ గ్రూప్ ఫొటో నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుల చిత్రాలను పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం (PMO) క్రాప్ చేసి (తొలగించి) సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఒక బాధ్యతాయుత దేశంగా వ్యవహరించాల్సిన చోట, పాక్ ప్రభుత్వం ఇలాంటి చిన్నపాటి ఎత్తుగడలకు పాల్పడటంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజకీయ లేదా నైతిక అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడానికే పాక్ PMO ఈ రకమైన చర్యలకు దిగిందని నెటిజన్లు ఎండగడుతున్నారు.

భారత దౌత్య పటిమ - ఉదారత: తేడా ఇక్కడే స్పష్టం!

పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ఫొటోను ఎడిట్ చేసి పోస్ట్ చేయగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఎటువంటి విభేదాలకు చోటివ్వకుండా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా ప్రతినిధులందరూ ఉన్న అసలు గ్రూప్ ఫొటోనే తన అధికారిక ఖాతాలో పంచుకున్నారు. పాకిస్థాన్ ఎంతో సంకుచిత మనస్తత్వంతో దౌత్య నిబంధనలను పక్కనబెడితే, భారత్ మాత్రం ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో విశాల దృక్పథాన్ని, దౌత్య పరిణతిని చాటుకుందని నెటిజన్లు కొనియాడుతున్నారు. పాక్ ఎంత ప్రయత్నించినా ప్రపంచ వేదికపై భారత్ ప్రాముఖ్యతను లేదా ప్రధాని మోదీ ప్రభావాన్ని తగ్గించలేదని, ఈ ఒక్క సంఘటనతో ఇరు దేశాల ఆలోచనా విధానాల మధ్య ఉన్న వ్యత్యాసం మరోసారి స్పష్టమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ సాయాన్ని కోరుతున్న నేపాల్-పెరుగుతున్న మృతుల సంఖ్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha