Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మత్స్యకారుల రక్షణకు ఇస్రో కీలక అడుగు.. లక్ష బోట్లకు ట్రాన్స్‌పాండర్లు

మత్స్యకారుల రక్షణకు ఇస్రో కీలక అడుగు.. లక్ష బోట్లకు ట్రాన్స్‌పాండర్లు

వార్త 3 weeks ago

ISRO Transponders: సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద సుమారు రూ.364 కోట్ల భారీ వ్యయంతో దేశవ్యాప్తంగా లక్ష ఫిషింగ్ పడవలకు అత్యాధునిక ట్రాన్స్‌పాండర్లను అమర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ గురువారం ఒక జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికను అధికారికంగా ప్రకటించింది.

ఇస్రో సాంకేతికతతో ‘వీసీఎస్ఎస్’ మరియు ‘నాభ్‌మిత్ర’ యాప్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘వెసెల్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్’ (వీసీఎస్ఎస్) ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఫిషింగ్ నౌకలపై ట్రాన్స్‌పాండర్లను అమర్చడంతో పాటు, అవసరమైన ఎర్త్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా, మత్స్యకారులకు సులభంగా అర్థమయ్యేలా ప్రాంతీయ భాషల్లో ‘నాభ్‌మిత్ర’ అనే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అర్హులైన మత్స్యకారులందరికీ ఈ పరికరాలను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు.

ISRO Transponders: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల భాగస్వామ్యం

ఈ ప్రాజెక్టు అమలుకు అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరించనున్నాయి. దీనిని 60:40 నిష్పత్తిలో (కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం) కేటాయిస్తారు. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం అయ్యే ఖర్చులో నూటికి నూరు శాతం (100 శాతం) నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని స్పష్టం చేశారు.

మత్స్యకారులకు అందే ప్రత్యేక ప్రయోజనాలు

ఈ అత్యాధునిక వ్యవస్థ ద్వారా సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులకు అనేక రకాల రక్షణలు, సేవలు లభిస్తాయి. ‘నాభ్‌మిత్ర’ యాప్ ద్వారా పడవ ఎక్కడుందనే కచ్చితమైన లొకేషన్‌ను ట్రేస్ చేయవచ్చు. వాతావరణ మార్పులు, తుఫాను హెచ్చరికలను ఎప్పటికప్పుడు పొందడంతో పాటు, ప్రమాద సమయాల్లో ‘ఎస్‌వోఎస్’ (SOS) ద్వారా అధికారులకు అత్యవసర సందేశాలు పంపవచ్చు. పొరపాటున పడవలు ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడకుండా ఈ సిస్టమ్ ముందుగానే హెచ్చరిస్తుంది. అలాగే, సముద్రంలో చేపలు ఎక్కువగా దొరికే వేట ప్రాంతాల (Potential Fishing Zones) సమాచారాన్ని కూడా ఇది అందిస్తుంది.

మౌలిక వసతుల అభివృద్ధి – ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కేంద్రాలు

మత్స్యకారుల సౌలభ్యం కోసం దేశవ్యాప్తంగా ఉన్న 1,547 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో, తొలి విడతగా 423 కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇందులో అత్యధికంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 350 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు.

నీట్‌ యూజీ-2026 కౌన్సెలింగ్‌లో కీలక మార్పులు: భౌతికంగా హాజరవ్వాలనే నిబంధన రద్దు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha