Congress Fire on Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపిన భేటీపై దేశీయంగా రాజకీయ సెగలు రేగుతున్నాయి. ఈ పర్యటనలో భారత్కు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావించడంలో ప్రధాని పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది.
ముఖ్యంగా ముగ్గురు భారతీయ నావికుల (సైలర్స్) మృతి ఉదంతాన్ని, అలాగే అమెరికాతో జరుగుతున్న ఏకపక్ష వాణిజ్య ఒప్పందాల (Trade Deals) గురించి మోడీ నోరు మెదపకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రయోజనాల కంటే కూడా ప్రధాని తన వ్యక్తిగత ప్రతిష్టకే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Read Also : పులుల సంరక్షణ కేంద్రం కింద భారతదేశపు మొట్టమొదటి 8-లేన్ల సొరంగం

ఇందిరను వదిలేయ్.. కనీసం మెలోనిని చూసైనా నేర్చుకో: పవన్ ఖేరా ఎద్దేవా
ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఘాటుగా స్పందిస్తూ ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశాన్ని ధైర్యంగా నడిపించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వంటి గొప్ప నాయకుల నుంచి నేర్చుకోవడం ప్రధానికి ఇష్టం లేకపోవచ్చునని, కానీ కనీసం ప్రస్తుత ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిని చూసైనా నేర్చుకోవాలని హితవు పలికారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రయోజనాల కోసం ఇతర దేశాల అధినేతల కళ్లలోకి కళ్లు పెట్టి, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎలా మాట్లాడాలో, ఎలా స్పందించాలో మెలోనిని చూసి మోడీ అలవర్చుకోవాలని ఖేరా ఎద్దేవా చేశారు. ట్రంప్ ముందు మోడీ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారనే కోణంలో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
తొలిసారిగా ఎఫ్ఏటీఎఫ్ (FATF) ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్!

