Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొగుడిని చంపి.. కొడుకును పొడిచిన సైకో భార్య!

మొగుడిని చంపి.. కొడుకును పొడిచిన సైకో భార్య!

వార్త 3 weeks ago

Karnataka Dharwad Crime: కర్ణాటకలో వెలుగు చూసిన ఓ ఘటన అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. భార్యాభర్తలిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉన్నారు.

కానీ అర్ధరాత్రి ఏం జరిగిందో ఏమో.. భర్తను, కత్తితో పొడిచి చంపేసి అంతటితో ఆగకుండా ఎనిమిదేళ్ల కుమారుడిపై కూడా దాడి చేసింది ఒక భార్య ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంట్లోనే భర్త శవం పక్కన కూర్చుని ఫోన్ చూసుకుంటూ కాలక్షేపం చేసింది. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు వచ్చి అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు వచ్చి అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు.

Read Also : Indian Stabbed In US : అమెరికాలో భారతీయుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడి

 Psychotic wife kills husband and stabs son!

వివరాల్లోకి వెళ్తే.. కిరణ్ హోనన్నవర్‌, ప్రియాంక భార్యాభర్తలు. వీరిద్దరూ డాక్టర్లే. కిరణ్ అనస్థీషియా స్పెషలిస్ట్ కాగా, ప్రియాంక కంటి వైద్యురాలు. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ ఫ్యామిలీ కర్ణాటకలోని ధార్వాడ్‌లో నివాసం ఉంటోంది. అయితే, గత రెండు రోజులుగా కిరణ్‎ను సంప్రదించేందుకు అతడి బంధువులు వరుసగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. కానీ అతడు ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కిరణ్ ఫోన్‎ను అతడి భార్య ప్రియాంక లిఫ్ట్ చేసి.. కిరణ్ ఇంట్లో లేడని ఒకసారి, పని మీద బయటకు వెళ్లాడని ఇంకొకసారి పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చింది.

Karnataka Dharwad Crime: ప్లాట్‌కు వెళ్లి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం!

ప్రియాంక సమాధానాలపై అనుమానంతో బంధువులు నేరుగా కిరణ్ ప్లాట్‎కు వెళ్లి చూడగా అక్కడ ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. కిరణ్, అతడి కుమారుడు ఇద్దరూ కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారి పక్కనే ప్రియాంక ఏమీ తెలియనట్లుగా చాలా ప్రశాంతంగా ఫోన్ చూస్తూ కూర్చొని ఉంది. ఈ భయంకరమైన దృశ్యం చూసిన బంధువులు, పొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

కొసప్రాణంతో కొడుకు

హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిరణ్, అతడి కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కిరణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా.. ఎనిమిదేళ్ల కుమారుడు కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘోరకలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలు ప్రియాంకను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతోందని పోలీసులు తెలిపారు. తీవ్రమైన కుటుంబ కలహాల వల్లే ప్రియాంక ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

మహిళను థార్‌తో ఢీకొట్టి, ఆసుపత్రికి తీసుకెళ్లి.. మృతదేహాన్ని మళ్లీ రోడ్డుపై పడేసిన మహిళా డ్రైవర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha