Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముడి చమురు దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ముడి చమురు దెబ్బతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

వార్త 1 week ago

Stock market: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 108.8 డాలర్లకు చేరడంతో భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.

దీనివల్ల దేశంలో దిగుమతి ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల మేర నష్టపోయి ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి.

Read also: Chicken rates today: ఆకాశానికి చికెన్ ధరలు.. జూన్ వరకు ఇంతేనా? కారణాలివే!

 Red stock market graph showing decline

Stock market: రూపాయి పతనం – కొత్త రికార్డులు

అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలం పెరగడంతో భారత రూపాయి విలువ ఘోరంగా పడిపోయింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే మన రూపాయి ఏకంగా 96.14 వద్దకు చేరి చరిత్రలోనే కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఈ పరిణామం విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన నింపడంతో వారు అమ్మకాలకు మొగ్గు చూపారు. ముఖ్యంగా మెటల్, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఏ రంగాల షేర్లకు లాభం? ఏవి నష్టం?

మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నా ఐటీ, మీడియా రంగాలు మాత్రం నిలకడగా రాణించాయి. ఇన్వెస్టర్లు రక్షణ కోసం ఐటీ షేర్లను కొనుగోలు చేయడం వీటికి కలిసివచ్చింది. అయితే హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడితో కుదేలయ్యాయి. నిఫ్టీకి ప్రస్తుతం 23,400 పాయింట్లు కీలకమైన స్థాయిగా ఉందని, ఇది దాటితే మరిన్ని నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha