IIT Bombay leopard attack: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే క్యాంపస్లో చిరుతపులి కలకలం రేపింది.
పవాయ్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలోని స్టాఫ్ హాస్టల్ ప్రాంగణంలో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఒక చిరుతపులి వీధికుక్కపై దాడి చేసి ప్రాణాలు తీసింది. ఈ షాకింగ్ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో క్యాంపస్ వర్గాల్లో తీవ్ర కలవరం మొదలైంది.
Read also: Ganpatipule Beach incident: మహారాష్ట్ర బీచ్లో విషాదం.. ఐదుగురు పర్యాటకులు మృతి!
సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యాలు
సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే.. హాస్టల్ మెట్ల దరిదాపుల్లో ఒక కుక్క నిలబడి ఉంది. ఏదో ప్రమాదాన్ని ముందుగానే ఊహించినట్లు అది ఒకే వైపు చూస్తూ అమితమైన అప్రమత్తతతో కనిపించింది. అంతలోనే చీకటి చాటు నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన చిరుతపులి ఆ కుక్కపై మెరుపువేగంతో దాడి చేసింది. ఆ కుక్క తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, చిరుత దాన్ని గట్టిగా పట్టుకుని మెడ కరచి చంపేసింది. ఆపై నిమిషాల వ్యవధిలోనే ఆ కళేబరాన్ని నోట కరచుకుని అక్కడి నుంచి చీకట్లోకి లాక్కెళ్లిపోయింది.
IIT Bombay leopard attack: విద్యార్థులు, నివాసితుల్లో పెరిగిన భయం
ఈ భయానక ఉదంతంతో క్యాంపస్లో నివసిస్తున్న విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది మరియు వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావడానికి జంకుతున్నారు. తాము పెంచుకునే పెంపుడు జంతువుల రక్షణపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ లోపల తిరిగే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒకరికొకరు సూచించుకుంటున్నారు.
అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటమే కారణం
ఐఐటీ బాంబే క్యాంపస్ విస్తీర్ణం చాలా పెద్దదిగా ఉండటంతో పాటు, ఇది దట్టమైన అటవీ ప్రాంతానికి (సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం సరిహద్దులకు) దగ్గరగా ఉంటుంది. ఈ కారణంగా గతంలో కూడా ఇక్కడ వన్యమృగాల సంచారం కనిపించిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఈసారి ఏకంగా హాస్టల్ భవనాల వద్దకు, నివాస ప్రాంతాల లోపలికి వచ్చి మరీ దాడులకు తెగబడటం స్థానికులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
పులుల సంరక్షణ కేంద్రం కింద భారతదేశపు మొట్టమొదటి 8-లేన్ల సొరంగం

