Dailyhunt
ముందుగానే నైరుతి రుతుపవనాలు.. రైతులకు గుడ్ న్యూస్

ముందుగానే నైరుతి రుతుపవనాలు.. రైతులకు గుడ్ న్యూస్

వార్త 1 week ago

ముందుగానే నైరుతి రుతుపవనాలు

Early monsoon : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశంలోకి ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత వాతావరణ శాఖ మాజీ డీజీ కేజీ రమేశ్ ప్రకారం, ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రుతుపవనాల రాక వేగంగా ఉండొచ్చని తెలిపారు. ఇది రైతులకు ముఖ్యంగా ఊరటనిచ్చే అంశంగా మారింది.

దక్షిణ భారతదేశానికి మెరుగైన వర్షాలు

ఎల్‌నినో ప్రభావం వల్ల ఉత్తర భారతదేశంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, దక్షిణ ప్రాంతాల్లో మాత్రం మంచి వర్షాలు కురుస్తాయని అంచనా. ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితులు కూడా వర్షాలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా మారితే వర్షపాతం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Read Also: Arvind Kejriwal: బీజేపీ, పంజాబ్ ప్రజలకు ద్రోహం చేసిందన్న కేజ్రీవాల్

మేలోనే వర్షాల ప్రారంభం

సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు ఈసారి మే మధ్యలోనే అండమాన్ ప్రాంతానికి (Early monsoon) చేరవచ్చని అంచనా. అలాగే యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ కూడా మే నెలాఖరుకే దక్షిణ భారతదేశంలో వర్షాలు మొదలవుతాయని వెల్లడించింది. అధికారిక అంచనాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఉక్రుల్ జిల్లాలో ఘర్షణలు.. ముగ్గురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha