Medak: మెదక్ మున్సిపల్ కో అప్షన్ సభ్యుల ఎన్నిక సమావేశం చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా మెదక్( Medak ) ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్ హాజరుయ్యారు.
ఇటీవల బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు గైర్హాజరు కావడం తో..మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ఉండటంతో నలుగురు రాగి వనజ, కోర్వి రాములు, తహెర్ అలీ, అనూష కాంగ్రెస్ కో అప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన కో అప్షన్ సభ్యులు ఎమ్మెల్యే రోహిత్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మున్సిపాలిటీ ముందు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

