JNTUK Kakinada Hostel mess issue:జేఎన్టీయూ హాస్టల్ విద్యార్థుల ఆకలి సమస్య ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ హాస్టల్ మెస్ ఫీజు బకాయిల పేరుతో యాజమాన్యం అకస్మాత్తుగా మెస్ తాళాలు వేసింది.
ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా తీసుకున్న ఈ నిర్ణయంతో హాస్టల్లో ఉన్న 200 మంది విద్యార్థులు గత మూడు రోజులుగా తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస మానవత్వం లేకుండా వందలాది మందిని ఆకలితో ఉంచడంపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
Read also: Shadnagar crime: ప్రియుడి మోజులో కన్నపిల్లలను వేడి నూనెతో కాల్చిన కసాయి తల్లి
The issue of hunger among JNTUK hostel students.
నోటీసు లేకుండానే మెస్ బంద్
హాస్టల్లో మొత్తం 1200 మంది విద్యార్థులు ఉండగా, సెలవుల వల్ల చాలా మంది ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం క్యాంపస్లో ఉన్న సుమారు 200 మంది విద్యార్థులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మెస్ మూసివేయడం దారుణం. విద్యార్థులు బయటకు వెళ్లలేక, మెస్లో భోజనం లేక ఆన్లైన్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులను ఇలా ఆకలితో ఉంచడంపై తల్లిదండ్రులు, విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
JNTUK Kakinada Hostel mess issue:ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థులు
యాజమాన్యం తీసుకున్న ఈ మొండి వైఖరిపై విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. తక్షణమే స్పందించి మెస్ పునఃప్రారంభించకపోతే, విద్యార్థులందరినీ ఏకం చేసి భారీ ధర్నాలు చేస్తామని హెచ్చరించాయి. క్యాంపస్లో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం పట్ల సమస్యలు తలెత్తుతాయని వారు ఆవేదన చెందుతున్నారు. యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరించడంపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Epaper: epaper.vaartha.com
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నగరానికి మరో 37 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ 5 రూట్లు ఇవే!

