టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటివాడయ్యారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆయన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా, తాజాగా ఆయన తన భార్య గురించి చేసిన ఒక ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
తిరుమల శ్రీవారి సన్నిధిలో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన వైవాహిక జీవితంపై తొలిసారిగా స్పందించారు. తన భార్య కావ్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, “నా పెళ్లాం నిప్పు రా” అంటూ మాస్ క్యాప్షన్ ఇచ్చారు. తన భార్యను ఎంతో ప్రేమగా ‘కావ్యమ్మ’ అని పిలుచుకుంటూ ఆయన చేసిన ఈ పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా సినిమాల్లో మాస్ డైలాగులు చెప్పే శ్రీనివాస్, నిజ జీవితంలో కూడా తన భార్యపై ఉన్న గౌరవాన్ని, ప్రేమను అదే శైలిలో వ్యక్తం చేయడం గమనార్హం.
Read Also : నందమూరి అభిమానులకు పండుగే.. బాలకృష్ణ, కొరటాల శివ కాంబో ఫిక్స్

సెలబ్రిటీల సందడితో వెలిగిపోయిన రిసెప్షన్
పెళ్లి తిరుమలలో ప్రైవేట్గా జరిగినప్పటికీ, హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ వేడుక మాత్రం తారల సందడితో కళకళలాడింది. ఈ నూతన దంపతులను ఆశీర్వదించడానికి టాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, యువ హీరో నాగచైతన్య, సీనియర్ నటుడు శ్రీకాంత్తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ ఒకే వేదికపై కనిపించడంతో ఈ వేడుక సినీ ప్రియులకు కనువిందుగా మారింది.
కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ‘జయ జానకి నాయక’ హీరో
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమై, తనదైన శైలిలో యాక్షన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సాయి శ్రీనివాస్.. ఇప్పుడు ఒక కొత్త బాధ్యతను స్వీకరించారు. కావ్యతో ఆయన వివాహ బంధం ఎంతో అన్యోన్యంగా సాగాలని అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో, తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్కమ్ చెబుతూ విషెస్ అందిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

