Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశం (TDP) తమ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులు చేపట్టింది. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలతో పాటు పొలిట్బ్యూరో సభ్యుల జాబితాను తాజాగా విడుదల చేసింది.
ఈ మార్పుల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం నారా లోకేష్ పదోన్నతి.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్
TDP’s Key Decisions
గత కొంతకాలంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యువగళం పాదయాత్ర ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన నారా లోకేష్కు ఇప్పుడు మరింత కీలక బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. లోకేష్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ఆయన, గతంలోనే కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి క్యాడర్లో మంచి పట్టు సాధించారు.
Nara Lokesh: రాష్ట్ర కమిటీలు మరియు కీలక నియామకాలు
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఈ కమిటీలను రూపొందించారు:
- రాష్ట్ర అధ్యక్షుడు: టీడీపీ ఏపీ విభాగం అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు తన పదవిలో కొనసాగనున్నారు.
- రాష్ట్ర కమిటీ: మొత్తం 185 మందితో భారీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది.
- పొలిట్బ్యూరో: పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్బ్యూరోలో సీనియర్లకు, యువతకు సమ ప్రాధాన్యత కల్పించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

