Palnadu Crime: ఆంధ్రప్రదేశ్లో వివాహం చేసుకున్న ఓ యువతిని కన్నతండ్రే అతి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన చౌడేశ్వరి (22) మరియు నాగరాజు గత నెల 4వ తేదీన ఇంటి నుంచి వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు.
అయితే, పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందాం రమ్మని పిలిపించి, నమ్మించి చేసిన మోసం చివరకు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది.
Read Also : Hanumakonda Crime: స్విమ్మింగ్ పూల్లో తల్లీ, ఇద్దరు కూతుళ్ల అనుమానాస్పద మృతి
Palnadu Crime: Father kills daughter for marrying her out of love!
Palnadu Crime: నమ్మించి పిలిచి.. ప్రాణం తీసి!
బాధిత దంపతులు తిరిగి మాచర్లకు చేరుకున్న తర్వాత, ఈ నెల 18న ఈ ఘాతుకం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన కూతురు చౌడేశ్వరిపై దాడి చేసి, గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత ఏమాత్రం కనికరం లేకుండా ఉరేసి ఆమెను హత్య చేశాడు. భర్తతోనే ఉంటానన్న కూతురి మొండితనాన్ని భరించలేక, పరువు కోసం తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
పోలీసుల దర్యాప్తు
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమ వివాహం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

