Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నన్ను టార్గెట్ చేసినందుకే అలాంటి వ్యాఖ్యలు చేశా ! - పవన్

నన్ను టార్గెట్ చేసినందుకే అలాంటి వ్యాఖ్యలు చేశా ! - పవన్

వార్త 3 days ago

Pawan Kalyan : తెలంగాణ రాజకీయాల్లో తన పర్యటనలపై రేగిన వివాదం మరియు తాను చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు.

గత 13 నెలలుగా కాంగ్రెస్ నాయకులు తనను పదే పదే టార్గెట్ చేస్తూ, హైదరాబాద్‌కు రావద్దంటూ ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. భారత పౌరుడిగా దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ తనకు ఉందని, తన ప్రాథమిక హక్కుకు భంగం కలిగించేలా కొందరు ప్రవర్తించడం వల్లే తీవ్ర ఆగ్రహంతో ‘మీ అయ్య జాగీరా?’ అని ప్రశ్నించాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ సమర్థించుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆయన మండిపడ్డారు.

Read Also : కాంగ్రెస్లో సెగలు రేపుతున్న 'మీనాక్షి' వ్యవహారం

రాహుల్ గాంధీకి కౌంటర్.. లోకేశ్‌తో పోటీ వాదనలపై పవన్ సమాధానం!

తనను హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటే, రేపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేదని చెప్పాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని చూడటం మూర్ఖత్వమే అవుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి నారా లోకేశ్‌తో ఉన్న రాజకీయ పోటీ వల్లే తాను తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించానంటూ వస్తున్న విమర్శలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడం మరియు ప్రజా సమస్యలపై పోరాడటం అనేది తమ పార్టీ అంతర్గత వ్యూహమని, దీనికి ఏపీ రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha