ప్రపంచ రాజకీయ పరిణామాలు మరియు అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం నేడు భారత స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది.
ముఖ్యంగా ఇరాన్ ప్రతిపాదించిన తాజా శాంతి ప్రణాళికను అమెరికా తిరస్కరించడం అంతర్జాతీయ మార్కెట్లలో అలజడి సృష్టించింది. దీనివల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా 3 శాతం పెరగడం, దేశీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఫలితంగా సెన్సెక్స్ మరియు నిఫ్టీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి.
కుప్పకూలిన మార్కెట్లు – సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం
ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 879 పాయింట్లు నష్టపోయి 76,434 స్థాయికి పడిపోయింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 252 పాయింట్లు కోల్పోయి 23,911 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా చమురు సెగలు ఒకవైపు ఉంటే, మరోవైపు దేశీయంగా ప్రధాని మోదీ చేసిన ‘పొదుపు’ సూచనలు కూడా మార్కెట్పై ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. పొదుపు పెరిగితే మార్కెట్లోకి వచ్చే నగదు ప్రవాహం తగ్గుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొనడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
Read Also : అమెజాన్ 'గ్రేట్ సమ్మర్ సేల్ 2026' ప్రారంభం

చమురు ధరల సెగ – ఇన్వెస్టర్ల ఆందోళన
భారతదేశం తన చమురు అవసరాల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో చమురు ధరలు పెరగడం రూపాయి విలువపై మరియు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. బ్యాంకింగ్, ఆటోమొబైల్ మరియు ఎనర్జీ రంగాలకు చెందిన షేర్లు నేడు తీవ్రంగా నష్టపోయాయి. అంతర్జాతీయ పరిణామాలు సద్దుమణిగేవరకు మార్కెట్లలో ఇదే విధమైన అనిశ్చితి కొనసాగే అవకాశం ఉందని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

