Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పవిత్ర రామాయణంలోని పాత్రలను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
రామాయణంలోని రాముడు మరియు లక్ష్మణులను ఉత్తర భారత వలస కూలీలుగా అభివర్ణించడమే కాకుండా, వారు రావణుడి పొలంలో దొంగతనం చేసినట్లుగా ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు శూర్పణఖ పాత్రను జీఎస్టీ (GST) మరియు డాలర్లతో ముడిపెట్టి చేసిన ఎద్దేవా నెటిజన్లను మరియు భక్తులను విస్మయానికి గురిచేసింది.
Prakash Raj Ramayana Comments Controversy
Prakash Raj: భగ్గుమన్న హిందూ సంఘాలు: న్యాయపరమైన చిక్కుల్లో నటుడు
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మరియు పలు ధార్మిక సంస్థలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కోట్ల మంది ఆరాధ్య దైవమైన రాముడిని, పవిత్ర ఇతిహాసాన్ని తక్కువ చేసి మాట్లాడటం అక్షంతవ్యమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ప్రకాష్ రాజ్ ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ పలు చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, మతపరమైన విశ్వాసాలను కించపరిచినందుకు గానూ ఆయనపై క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం అందుతోంది. గతంలోనూ పలు సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చలకు దారితీసినప్పటికీ, ఈసారి ఏకంగా పురాణ పాత్రలపై చేసిన వ్యాఖ్యలు ఆయనను తీవ్ర న్యాయపరమైన చిక్కుల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

