Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు విచారణకు రాని భగీరథ్: 2 రోజుల సమయం కావాలని లేఖ!

నేడు విచారణకు రాని భగీరథ్: 2 రోజుల సమయం కావాలని లేఖ!

వార్త 1 week ago

Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్, బుధవారం (మే 13) మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌బషీరాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆయన గైర్హాజరయ్యారు.

వ్యక్తిగత కారణాల దృష్ట్యా తనకు మరో రెండు రోజుల సమయం కావాలని కోరుతూ పోలీసులకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు.

Read Also:Telangana Police : బక్రీద్‌కు తెలంగాణ పోలీసుల భారీ భద్రతా చర్యలు

కేసు నేపథ్యం, ఆరోపణలు

మే 8వ తేదీన ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు భగీరథ్‌పై POCSO చట్టం, BNS (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అయితే, ఈ కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు బాలిక కుటుంబం తనను హనీట్రాప్‌ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.తనపై వస్తున్నవి రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని పేర్కొంటూ భగీరథ్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది గురువారం (మే 14) విచారణకు వచ్చే అవకాశం ఉంది.

 Bandi Bhagirath Case

Bandi Bhagirath POCSO Case Update: పోలీసుల తదుపరి చర్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ కేసును విచారిస్తోంది.నిన్ననే కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు.భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు మహిళా సంఘాలు భారీ ఎత్తున నిరసన చేపట్టాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha