Vizag Steel Plant Accident: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో సోమవారం సాయంత్రం ఒక పెను విషాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్లోని 'స్టీల్ మెల్టింగ్ షాప్-1' (SMS-1) విభాగంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దాదాపు 1600 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతతో మరిగిపోతున్న ద్రవ ఉక్కును తరలిస్తున్న క్రేన్ బకెట్ ఒక్కసారిగా విరిగిపడటమే ఈ ఘోరానికి దారితీసినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

ఈ ప్రమాదం కారణంగా వందల టన్నుల ద్రవ ఉక్కు ఒక్కసారిగా కింద పనిచేస్తున్న కార్మికులపై పడటంతో, 9 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం అధికారులకు కష్టతరంగా మారింది. మరికొందరు కార్మికులు తీవ్ర గాయాలపాలు కాగా, వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
Read also: Challapalli Veerayya Choudhary:ప్రజల జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టాలి!
Vizag Steel Plant Accident: ప్రభుత్వం స్పందన – నేడు పవన్, లోకేష్ పర్యటన:
ఈ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. విశాఖ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి నారా లోకేష్ సైతం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, మంగళవారం (ఈరోజు) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు, మరణించిన కార్మికుల కుటుంబాలను పరామర్శించి వారికి ప్రభుత్వం తరఫున ధైర్యాన్ని అందించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

