Nepal Floods: నేపాల్లో సంభవించిన తీవ్ర ఆకస్మిక వరదల దాటికి కొట్టుకుపోయిన ఏడు మృతదేహాలు ఉత్తరప్రదేశ్లోని సరిహద్దు జిల్లాల్లో ప్రత్యక్షమయ్యాయి.
నేపాల్లోని చిత్వాన్ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న యూపీలోని మహారాజ్గంజ్, కుశినగర్ జిల్లాల్లో ప్రవహిస్తున్న నదుల్లో ఈ మృతదేహాలు తేలుతూ కనిపించాయని స్థానిక అధికారులు వెల్లడించారు.
Read Also : Nepal Barrier Lake: భయపెడుతున్న బ్యారియర్ లేక్.. ఏ క్షణంలోనైనా బద్దలయ్యే ప్రమాదం
Seven bodies washed away by Nepal floods found floating in UP rivers.
Nepal Floods: మహారాజ్గంజ్, కుషినగర్ నదీ తీరాల్లో వెలికితీత
వివరాల్లోకి వెళితే, మహారాజ్గంజ్ జిల్లా పరిధిలోని నదీ ప్రవాహంలో నాలుగు మృతదేహాలను, కుషినగర్ జిల్లా పరిధిలోని నదీ తీరాలలో మూడు మృతదేహాలను స్థానిక అధికారులు వెలికితీశారు. నేపాల్లో కురిసిన భారీ వర్షాలు, ఊహించని ఆకస్మిక వరదల మూలంగానే వీరంతా కొట్టుకుపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
భారత్లోకి మృతదేహాలు కొట్టుకొచ్చిన నదీ ప్రవాహ మార్గం
టిబెట్లో ఉద్భవించే Bhote Koshi River నేపాల్లోకి ప్రవేశించి త్రిశూలి నదీ వ్యవస్థలో భాగమవుతుంది. ఆపై ఇది దేవఘాట్ వద్ద Kali Gandaki River తో కలిసి ‘గండకీ’ నదిగా రూపాంతరం చెంది భారత్లోకి ప్రవేశించి గంగానదిలో కలుస్తుంది. ఈ విశాలమైన నదీ ప్రవాహ మార్గం గుండానే మృతదేహాలు నేపాల్ నుంచి భారత భూభాగంలోకి కొట్టుకొచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.
లభ్యమైన మృతదేహాలను గుర్తించేందుకు, వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించేందుకు భారత అధికారులు నేపాల్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు. ఘటనపై ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.

