Kieron Pollard Fine: ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ వివాదంలో చిక్కుకున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అధికారుల పట్ల లేదా వారి నిర్ణయాల పట్ల ఆయన ప్రదర్శించిన తీరు ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఈ మేరకు పొలార్డ్పై లెవల్-1 నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి, ఆయన మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read Also:Robin Singh: ముంబై ఇండియన్స్కు రాబిన్ సింగ్ గుడ్బై

Kieron Pollard Fine: మ్యాచ్ ఫీజులో 15% కోత!
సాధారణంగా మైదానంలో దూకుడుగా ఉండే పొలార్డ్, కోచ్గా మారిన తర్వాత కూడా తన ఆవేశాన్ని తగ్గించుకోలేకపోయారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ అధికారుల నిర్ణయాలను బహిరంగంగా లేదా అనుచితంగా ప్రశ్నించడం ఐపీఎల్ గైడ్లైన్స్ ప్రకారం నేరం. పొలార్డ్ తన తప్పును అంగీకరించడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసినప్పటికీ, ముంబై ఇండియన్స్ వంటి పెద్ద ఫ్రాంచైజీకి ఇది కాస్త ఇబ్బందికర పరిణామమే. గతంలో కూడా పలువురు ఆటగాళ్లు, కోచ్లు ఇలాంటి జరిమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

