High Temperature : రాష్ట్రవ్యాప్తంగా సూర్యుడు పగబట్టినట్లు నిప్పులు చెరుగుతున్నాడు. రోహిణీ కార్తె ప్రవేశానికి ముందే ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు.
నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వడదెబ్బ (Heat stroke) కారణంగా 22 మంది మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత, వేడి గాలులు తోడవడంతో రోడ్లన్నీ మధ్యాహ్నం వేళ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, నిరుపేదలు, వృద్ధులు ఈ వడగాడ్పుల బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Read Also : రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు బహిరంగ లేఖ.. రైతు సమస్యలపై ఆగ్రహం

రెడ్ అలర్ట్ జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పరిస్థితి నానాటికీ దిగజారుతుండటంతో వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ (Red Alert) జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా ఉండనుంది. ఈ జిల్లాల ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా (Dehydration) నిరంతరం మంచినీరు, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం, మజ్జిగ, కొబ్బరినీళ్లు లాంటి ద్రవాహారాలను తీసుకోవడం ద్వారానే ఈ ప్రాణాంతక వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోగలమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఏసీబీ వలలో బోయిన్పల్లి మహిళా ఎస్సై: రూ. 30 వేల లంచం తీసుకుంటూ పట్టుబట్టారు

