Mahesh Kumar Goud: హైదరాబాద్లోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం 'గాంధీ భవన్'లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈ వేడుకల్లో పాల్గొని, ఒక భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఆయన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ శ్రేణుల కోలాహలంతో గాంధీ భవన్ పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణాన్ని తలపించాయి.

యువతకు ఉపాధి, పేపర్ లీకేజీలపై రాజీలేని పోరాటం: మహేశ్ కుమార్ గౌడ్
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోని నిరుద్యోగులకు సరైన ఉపాధి కల్పించడంతో పాటు అందరికీ సమాన అవకాశాలు అందించడమే రాహుల్ గాంధీ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విపరీతమైన ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని ఆయన కొనియాడారు.
Read also:Asifabad couple murder: దంపతుల దారుణ హత్య.. పీరిల ఉదంతమే ప్రాణం తీసిందా..?
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీల ఉదంతాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లీకేజీల వల్ల లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, యువత భవిష్యత్తు మారాలంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు రావాలని డిమాండ్ చేశారు.
Mahesh Kumar Goud: సామాజిక న్యాయమే లక్ష్యం.. కేంద్రంపై విమర్శలు
రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమానత్వం, యువత సాధికారతతో కూడిన నవ భారత నిర్మాణం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహేశ్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం కొద్దిమంది కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే తాపత్రయపడుతోందని ఆయన మండిపడ్డారు.
సామాన్యులు, రైతులు, కార్మికులు మరియు నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని భరోసా ఇచ్చారు. దేశ ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు వీలుగా రాహుల్ గాంధీకి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

