Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్-పీజీ పరీక్షకు ముందే ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య!

నీట్-పీజీ పరీక్షకు ముందే ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య!

వార్త 3 weeks ago

RTC X Roads: హైదరాబాద్‌ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన యశస్విని (యశ్విత) అనే 26 ఏళ్ల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది.

నీట్-పీజీ (NEET-PG) పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘోరం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Read Also :Vishaka Crime : విశాఖలో ఘోర విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

ఘటనకు సంబంధించిన వివరాలు

కర్నూలు జిల్లా రెడ్డి నగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బండి రామ్మోహన్ రెడ్డి కుమార్తె యశస్విని. గత ఆరు నెలలుగా ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ పరిధిలోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ నీట్-పీజీ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన యశస్విని, ఆ తర్వాత 9:30 గంటల నుంచి ఫోన్ తీయకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా గదిలో అచేతనంగా పడి ఉంది.

RTC X Roads: కేసు నమోదు & పోలీసుల విచారణ

పరీక్ష ఒత్తిడి కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమిక విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు. చిక్కడుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు: బీటెక్, డిగ్రీ విద్యార్థుల సహా 9 మంది అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha