తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్ కుటుంబం ఒక అరుదైన రికార్డును సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు వేర్వేరు పార్టీల తరపున పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ఒక కుటుంబం ఒకే పార్టీలో ఉండటం చూస్తుంటాం. కానీ శాంటియాగో మార్టిన్ కుటుంబం మాత్రం ఇందుకు భిన్నంగా మూడు వేర్వేరు రాజకీయ పార్టీల నుండి పోటీ చేసి విజయం సాధించింది. మార్టిన్ భార్య లీమా రోజ్, కుమారుడు జోస్ ఛార్లెస్, మరియు అల్లుడు ఆధవ్ అర్జున ఈ ఎన్నికల్లో గెలుపొందారు. వీరంతా వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీల తరపున బరిలోకి దిగడం, ప్రజలు అందరినీ ఆదరించడం విశేషం. రాజకీయాల్లో పట్టు సాధించేందుకు మార్టిన్ కుటుంబం పక్కా వ్యూహంతో ముందుకు సాగినట్లు ఈ ఫలితాలు చూస్తే అర్థమవుతోంది.
Read Also : తండ్రి ఓడినా.. కొడుకు గెలిచాడు: ఉదయనిధి స్టాలిన్ ఘన విజయం!

లీమా రోజ్ ఘనవిజయం.. అల్లుడి సత్తా
తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుండి AIADMK (అన్నా డీఎంకే) అభ్యర్థిగా పోటీ చేసిన మార్టిన్ భార్య లీమా రోజ్ సుమారు 51 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈమె తమిళనాడులోనే అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా వార్తల్లో నిలిచారు. మరోవైపు, మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున చెన్నైలోని విల్లివాక్కం నియోజకవర్గం నుండి దళపతి విజయ్ నేతృత్వంలోని TVK (తమిళగ వెట్రి కళగం) పార్టీ తరపున పోటీ చేసి 57 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఆధవ్ అర్జున విజయ్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పుదుచ్చేరిలో కుమారుడి జయం.. కాకపోతే చిన్న ట్విస్ట్!
మార్టిన్ కుమారుడు జోస్ ఛార్లెస్ పుదుచ్చేరిలోని కామరాజ్ నగర్ నియోజకవర్గం నుండి తన సొంత పార్టీ LJK (లచ్చియ జననాయక కజగం) తరపున పోటీ చేసి 16 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. లీమా రోజ్ AIADMK (ప్రతిపక్ష కూటమి) నుండి, ఆధవ్ అర్జున TVK (స్వతంత్ర శక్తి) నుండి గెలవగా, జోస్ ఛార్లెస్ మాత్రం పుదుచ్చేరిలో NDA కూటమి మద్దతుతో బరిలోకి దిగారు. ఇలా ఒకే కుటుంబం నుండి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ, వారు అసెంబ్లీలో వేర్వేరు పక్షాల తరపున గళం విప్పనుండటం ఆసక్తికరమైన పరిణామం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

