Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అయ్యో పాపం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్య

అయ్యో పాపం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఆత్మహత్య

వార్త 3 weeks ago

Andhra Pradesh Crime: కృష్ణా జిల్లాలో అత్యంత సామూహిక విషాద ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలం అనంతాయిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఒకే ఇంట్లో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు, తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: Bengaluru Bus Fire Accident: ఆర్టీసీ బస్సులో భారీ అగ్నిప్రమాదం

 Three women from the same family commit suicide

Andhra Pradesh Crime: మృతుల వివరాలు.. ఉరేసుకుని బలవన్మరణం

ఈ ఘోర ఘటనలో రజని (60), ఆమె కుమార్తె గౌరి (40), కోడలు మధు (35) తమ నివాసంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటివరకు సాధారణంగా ఉన్నవారు.. ఇలా ఒకేసారి ఇంట్లో విగతజీవులుగా వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు, పొరుగువారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, తీవ్రమైన కుటుంబ సమస్యల కారణంగానే మనస్తాపం చెంది వీరంతా ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే గూడూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరుగుపొరుగు వారిని అడిగి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.

Epaper: epaper.vaartha.com

రూ. 16,350 కోట్లతో JSW స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha