Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాక్, చైనా మన శాశ్వత శత్రువులు కాదు - RSS చీఫ్

పాక్, చైనా మన శాశ్వత శత్రువులు కాదు - RSS చీఫ్

వార్త 8 hrs ago

Pak - China : పాకిస్థాన్ మరియు చైనా దేశాలు భారత్‌కు శాశ్వత శత్రువులు కావని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో దేశాల మధ్య వివాదాలు తలెత్తడం సహజమని, సరిహద్దు లేదా ఇతర తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సమయంలో పరిస్థితులు సద్దుమణిగే వరకు దౌత్యపరమైన సంబంధాలను లేదా చర్చలను నిలిపివేయడం ఆనవాయితీ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతమాత్రాన పొరుగు దేశాలతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవడం లేదా వారిని శాశ్వతంగా శత్రువులుగా ముద్ర వేయడం సరైన విధానం కాదని జెన్-జీ (Gen Z), జెన్ ఆల్ఫా (Gen Alpha) యువత కోసం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు.

అత్యవసర వేళల్లో ఐక్యతే మార్గం

దేశభద్రత మరియు అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడు పౌరులందరూ ఏకతాటిపైకి రావాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి ప్రజలంతా ప్రభుత్వానికి పూర్తినైతిక మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతి ప్రయోజనాలు, భద్రత ముడిపడి ఉన్న సమయాల్లో విభిన్న ఆలోచనలు కలిగిన సమాజం మొత్తం ఒక్కటై నిలబడితేనే ఏ దేశమైనా సవాళ్లను అధిగమించగలదని ఆయన యువతకు దిశా నిర్దేశం చేశారు. పరస్పర వ్యూహాత్మక సంబంధాలు, జాతీయ భద్రత, ఐక్యతపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ATFలో ఇథనాల్.. రామ్మోహన్ రియాక్షన్ ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha