చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస
Qamar Javed Bajwa: పాకిస్తాన్ మాజీ సైన్యాధిపతి జనరల్ కమర్ జావేద్ బాజ్వా (65) మరణించారు. గత కొంతకాలంగా తలకు అయిన తీవ్ర గాయంతో బాధపడుతున్న ఆయన, రావల్పిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (ఆదివారం, మార్చి 29, 2026) తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. బాజ్వా మృతితో పాకిస్తాన్ సైనిక, రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.
Read Also: Iran : పాకిస్తాన్ కు భారీ ఊరట కల్పించిన ఇరాన్
బాత్రూమ్లో ప్రమాదం.. నెలరోజుల పోరాటం
మీడియా కథనాల ప్రకారం.. ఫిబ్రవరి 2026లో బాజ్వా తన నివాసంలోని బాత్రూమ్లో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని రావల్పిండి మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆయన బావమరిది నయీమ్ ఘుమాన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. బాజ్వా ప్రమాదం నుండి 100 శాతం బయటపడ్డారని, వైద్యులు పెద్ద శస్త్రచికిత్స చేశారని తెలిపారు. అయితే ఐసీయూలో నెలరోజులకు పైగా ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
General Qamar Javed Bajwa Passes Away
ఆరు సంవత్సరాల పాటు సైన్యాధిపతిగా సేవలు
నవంబర్ 2016 నుండి నవంబర్ 2022 వరకు, దాదాపు ఆరేళ్లపాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా, కమర్ జావేద్ బాజ్వా తన సంపద, రాజకీయ ప్రకటనల కారణంగా వార్తల్లోనే నిలిచారు. తన పదవీకాలంలో భారీగా సంపదను కూడబెట్టారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇది పాకిస్తాన్లో రాజకీయ దుమారానికి కారణమైంది.
జనరల్ బాజ్వా పదవీకాలం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆయనను ఆర్మీ చీఫ్గా నియమించారు, కానీ తరువాతి సంవత్సరాలలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంతో ఆయన సంబంధాలు కూడా పరిశీలనకు గురయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రావడానికి సహాయపడ్డారని, తెరవెనుక నుండి అధికారాన్ని నియంత్రించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బాజ్వా పదవీకాలంలో, భారతదేశంతో జరిగిన బాలాకోట్ వైమానిక దాడి వంటి ప్రధాన సైనిక సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. బాజ్వా పదవీకాలంలో, పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలలో సైన్యం జోక్యంపై తరచుగా ప్రశ్నలు తలెత్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

