ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ తన జీవితంలోని కష్టాలను గుర్తు చేసుకున్నారు. 'నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో అవమానాలను భరించాను, ఆకలి బాధలు అనుభవించాను.
జీవితం నాకు నేర్పిన పాఠాలే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చాయి” అని ఉద్వేగంతో పలికారు. సినిమాల్లో తనను ఆదరించి, అత్యున్నత స్థానంలో నిలబెట్టిన అభిమానుల రుణం తీర్చుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఒక సాధారణ వ్యక్తిగా తాను ఎదుర్కొన్న సవాళ్లే, సామాన్యుల సమస్యలను పరిష్కరించడానికి తనకు స్ఫూర్తినిస్తాయని విజయ్ పేర్కొన్నారు.
Read Also : 29 ఏళ్లకే మంత్రిగా ఎస్. కీర్తన సరికొత్త రికార్డు

పారదర్శక పాలన
విజయ్ తన ప్రసంగంలో పారదర్శకతకు (Transparency) పెద్దపీట వేశారు. తన పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతికి తావులేకుండా చూస్తానని ఉద్ఘాటించారు. “ప్రజా ధనం ప్రజలకే చెందాలి. నేను ప్రజా ధనాన్ని వృథా చేయను, ఎవరినీ దోచుకోనివ్వను” అని ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వ నిధులు నేరుగా లబ్ధిదారులకు అందేలా చూస్తానని, ప్రతి పైసా ఖర్చుపై ప్రజలకు జవాబుదారీగా ఉంటానని హామీ ఇచ్చారు. ద్రవిడ రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో, విజయ్ చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మైనార్టీలకు భరోసా
రాజకీయాల్లోకి రాకముందు నుంచే అందరినీ సమంగా చూసే విజయ్, తన పాలనలో మైనార్టీ ప్రజలకు ప్రత్యేక అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కులమతాలకు అతీతంగా, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అందరినీ కలుపుకుపోయే తన విధానం తమిళనాడులో సరికొత్త సామరస్య పూర్వక వాతావరణాన్ని నిర్మిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైనార్టీల హక్కుల పరిరక్షణలో తన ప్రభుత్వం ముందుంటుందని పేర్కొంటూ, అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని విజయ్ ఉద్ఘాటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
అవమానించిన చోటే విజయ్ ప్రమాణ స్వీకారం..ఇది కదా అసలైన సీన్ !!

