Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పార్లమెంట్‌ సమావేశాలపై రాహుల్‌ గాంధీ వైఖరిని తప్పుబట్టిన ప్రహ్లాద్‌ జోషి

పార్లమెంట్‌ సమావేశాలపై రాహుల్‌ గాంధీ వైఖరిని తప్పుబట్టిన ప్రహ్లాద్‌ జోషి

వార్త 1 week ago

Pralhad Joshi : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. చివరిరోజు కేవలం వందేమాతర గీతాలాపనకు లోక్‌సభ పరిమితమైంది.. అనంతరం లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది.

రాజ్యసభలో కాసేపు చర్చ నడిచింది. విపక్షాల ఆందోళన కారణంగా సభను స్పీకర్‌ ఓంబిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. 19 రోజుల పాటు లోక్‌సభ సమావేశాలు జరిగాయి. లోక్‌సభ వాయిదా తరువాత స్పీకర్‌ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు విపక్షాలు హాజరుకాలేదు. అయితే, డీఎంకే ఎంపీ కనిమొళి మాత్రం స్పీకర్‌ తేనీటి విందుకు హాజరయ్యారు. కాగా.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు, నిరవధిక వాయిదాపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. వర్షాకాల సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు.

 Pralhad Joshi

Pralhad Joshi : తన ఇష్టానుసారమే నడవాలని

వర్షాకాల సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల, ఆమోదించబడిన బిల్లులు మినహా, జరగాల్సిన ఇతర చర్చలు, నిర్మాణాత్మక పనులు జరగకుండా పోయాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కేవలం ఒక వ్యక్తి అహంకారం వల్లే మొత్తం సమావేశాలు దెబ్బతిన్నాయన్నారు. వారు డిమాండ్లు చేస్తారు, ఆ డిమాండ్లను అంగీకరించినప్పుడు అక్కడి నుండి పారిపోతారంటూ విమర్శించారు. వారం రోజుల క్రితం, హోం మంత్రి సమాధానం ఇస్తారని కిరణ్ రిజిజు పార్లమెంటులో చెప్పారు.. ఆ హామీ ఇచ్చినప్పటికీ, వారు దానిని అంగీకరించలేదు. నిన్న స్వయంగా హోం మంత్రి మాట్లాడినప్పుడు కూడా, వారు తమ డిమాండ్లను మార్చి ఆయన రాజీనామాను కోరారంటూ విమర్శించారు. అలాంటి వారు జార్ఖండ్‌కు ఎందుకు వెళ్లడం లేదు?… మీ సొంత మంత్రులను మీరు ఎందుకు హెచ్చరించడం లేదు? రాహుల్ గాంధీ వ్యవహారశైలిలో పక్షపాతం.. అహంకారం కనిపిస్తాయి.. ప్రభుత్వ రాజ్యాంగపరమైన విధానాలను విస్మరించి, పార్లమెంటు తన ఇష్టానుసారమే నడవాలని ఆయన కోరుకుంటున్నారు.. అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తచేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha