Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?

పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?

వార్త 1 month ago

PBKS vs RR: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు ఒక ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది.

టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్ (PBKS), బలమైన రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. విశేషమేమిటంటే, ఈ సీజన్‌లో ముల్లాంపూర్ స్టేడియం వేదికగా జరగనున్న చివరి మ్యాచ్ ఇదే కావడంతో క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also:Wasim Jaffer: పంత్‌కు కెప్టెన్సీ వద్దు.. మార్‌క్రమ్‌కు పగ్గాలు ఇవ్వండి: వసీం జాఫర్ షాకింగ్ కామెంట్స్

PBKS vs RR: వర్షం ముప్పు.. మ్యాచ్ జరుగుతుందా?

ఈ కీలక మ్యాచ్‌పై వాతావరణం ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) నివేదిక ప్రకారం, చండీగఢ్‌లో నేడు 20-30 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు బీబీసీ (BBC) వెదర్ నివేదిక ప్రకారం, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి (సాయంత్రం) వర్ష సూచన 40 శాతంగా ఉంది. అయితే, మ్యాచ్ గడుస్తున్న కొద్దీ రాత్రి వేళకు వర్షం తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షం కారణంగా ఓవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నా, పూర్తి స్థాయిలో మ్యాచ్ జరిగేలా గ్రౌండ్ స్టాఫ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్, తన హోమ్ గ్రౌండ్‌లో చివరి మ్యాచ్‌ను కూడా గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ కూడా పంజాబ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. పిచ్ కండిషన్స్, వర్ష ప్రభావం దృష్ట్యా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

విమర్శలే నా ఆయుధాలు: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha