Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సభకు అనుమతి నిరాకరణ మరియు ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తొలిసారిగా స్పందించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక చిట్చాట్లో ఆయన ఈ అంశంపై కీలక వివరణ ఇచ్చారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్కు పూర్తి రాజకీయ స్వేచ్ఛ ఉందని, ఆయన ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చునని, అవసరమైతే రాబోయే ఎన్నికల్లో పోటీ కూడా చేయవచ్చునని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో దేశంలోని ఏ పౌరుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా తమ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కు ఉంటుందని, ఇప్పటికే ఇక్కడ ఎన్నో పక్క రాష్ట్రాల పార్టీలు పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ను ఇక్కడ ఎవరూ అడ్డుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
Read Also : జూన్ 15 నుంచి బడులు ప్రారంభం.. ప్రభుత్వ స్కూళ్లకు కొత్త సదుపాయాలు

సభకు అనుమతి నిరాకరణపై స్పష్టత.. ఏపీ పరిణామాలపై రేవంత్ ప్రశ్నలు
హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన సభకు పర్మిషన్ నిరాకరించడం వెనుక కేవలం శాంతిభద్రతల (Law & Order) కారణాలు మాత్రమే ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సభల పేరిట నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటే, ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తగిన రీతిలో సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన ప్రశ్న సంధించారు. తెలంగాణ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, మొదట తమ సొంత రాష్ట్రమైన ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలకు, పర్యటనలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

