Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లి ఇంట  విషాదం.. కంభం జాతీయ రహదారిపై లారీ బీభత్సం..నలుగురు మృతి!

పెళ్లి ఇంట విషాదం.. కంభం జాతీయ రహదారిపై లారీ బీభత్సం..నలుగురు మృతి!

వార్త 1 day ago

Cumbum Road Accident: కొద్దిగంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒకే కుటుంబంలో జాతీయ రహదారి మృత్యువు రూపంలో ఘోర విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా (మార్కాపురం డివిజన్) కంభం పట్టణ పరిధిలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం (జూలై 3) ఉదయం గుండెల్ని పిండేసే భయానక రోడ్డు ప్రమాదం సంభవించింది.

పెళ్లికూతురు, ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ఆటోను ఒక అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దారుణ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడాదిన్నర పసికందుతో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివాహ మహోత్సవంతో ఎంతో సంతోషంగా సాగాల్సిన ఇంట.. ఈ ప్రమాదం ఒక్కసారిగా శ్మశాన వైరాగ్యాన్ని నింపింది.

Read Also:ACB Raids DSP Bhimreddy House: ఆదాయానికి మించిన ఆస్తులు! - డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

గుడి వద్ద కొబ్బరికాయ కొడుతుండగా దూసుకొచ్చిన మృత్యువు

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లబండ బజారుకు చెందిన ఆవుల వీరక్కకు, కంభం పట్టణానికి చెందిన పాములేటికి జూలై 3 (శుక్రవారం) ఉదయం 9:30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పెళ్లికూతురు బృందం గిద్దలూరు నుండి ఆటోలో కంభం చేరుకుంది. కంభంలోని ‘వై జంక్షన్’ (Y-Junction) వద్ద ఉన్న వినాయకుడి గుడి వద్ద పెళ్లికూతురు వీరక్కతో కొబ్బరికాయ కొట్టించేందుకు పెళ్లి బృందం ఆటో ఆపి దిగింది. అదే సమయంలో జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ.. రోడ్డు పక్కన ఉన్న పెళ్లి బృందాన్ని, ఆటోను అత్యంత బలంగా ఢీకొట్టింది. పెళ్లి బృందాన్ని గుద్దిన అనంతరం కూడా లారీ ఆగలేదు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆ లారీ రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలను (బైక్‌లను), పక్కనే ఉన్న బడ్డీ బంకులను కూడా పూర్తిగా తొక్కుకుంటూ దూసుకెళ్లింది.

Cumbum Road Accident: ఏడాదిన్నర చిన్నారితో సహా నలుగురు మృతి - నలుగురి పరిస్థితి విషమం

ఈ భయానక క్రాష్ జరగడంతో ఘటనా స్థలంలో రక్తసిక్తంగా మారి కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ ప్రమాదంలో గిద్దలూరుకు చెందిన ఆవుల అలకనంద (19), అంకాలు (20), నగేష్ (17) అనే ముగ్గురు యువకులు సంఘటనా స్థలంలోనే శరీరాలు నలిగిపోయి ప్రాణాలు విడిచారు. కాగా, తీవ్రంగా గాయపడిన నాగేశ్వరి (2) అనే ఏడాదిన్నర చిన్నారి కంభం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రమాదంలో మరో ఎనిమిది మంది పెళ్లి బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కంభం పోలీసులు 108 అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో మెరుగైన అత్యవసర వైద్యం కోసం అక్కడి నుండి మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Epaper: epaper.vaartha.com

పికప్ వాహనంతో ఎనిమిది మంది బౌద్ధ భిక్షువులను ఢీకొట్టి చంపిన 11 ఏళ్ల బాలుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha