Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఎం కిసాన్ 24వ విడత అక్టోబర్‌లోనే!

పీఎం కిసాన్ 24వ విడత అక్టోబర్‌లోనే!

వార్త 2 weeks ago

PM kisan update:రైతులకు అందే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల గురించి తాజా సమాచారం వెలువడింది. గత జూన్‌లో ఇరవై మూడో విడత డబ్బులు విడుదల కాగా, ఇప్పుడు ఇరవై నాల్గవ విడత రెండు వేల రూపాయల ఆర్థిక సాయం ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, రాబోయే అక్టోబర్ నెలలో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావచ్చునని తెలుస్తోంది.

Read also: Gang-Rape OnTribal Woman : గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం - ముగ్గురి అరెస్టు

 PM Kisan 24th Installment October

పీఎం కిసాన్ నిధులు పొందడానికి పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులు.

ఈ పథకం ద్వారా సాయం పొందాలంటే రైతులు కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. లబ్ధిదారులు అందరూ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. అలాగే సాగు భూమి ధృవీకరణ పత్రాలు సరిగ్గా ఉండాలి. ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడం చాలా ముఖ్యం. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయి ఉండాలి. ఈ పనులన్నీ సక్రమంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో మాత్రమే తదుపరి విడత డబ్బులు జమ అవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

PM kisan update:రైతులు సకాలంలో పూర్తి చేయవలసిన తనిఖీ ప్రక్రియ.

అర్హత ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల చాలా మందికి డబ్బులు ఆగిపోతుంటాయి. దీన్ని నివారించడానికి రైతులు తమ వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింక్ అయిందా లేదా అని దగ్గర్లోని బ్యాంకులో లేదా సేవా కేంద్రంలో పరిశీలించుకోవాలి. అన్ని అర్హతలు సకాలంలో పూర్తి చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకి ప్రభుత్వ సాయం జమ అవుతుంది.

Epaper: epaper.vaartha.com

ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులు.. NPCI క్రేజీ ఫీచర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha